Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

టీఎంసీలో భారీ తిరుగుబాటు: మమతా బెనర్జీకి గట్టి షాక్

Sita Ramachandran Jun 03, 2026 9:12 AM అల్ ఇండియా 13 viewsabout 15 hours ago
టీఎంసీలో భారీ తిరుగుబాటు: మమతా బెనర్జీకి గట్టి షాక్ - Udayam Digital
పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన టీఎంసీకి చెందిన 58 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. పార్టీ నుంచి సస్పెండైన రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ వారంతా స్పీకర్ రతీంద్ర బోస్‌కు లేఖ సమర్పించారు. మరోవైపు శోభన్‌దేవ్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అభిషేక్ బెనర్జీ స్పీకర్‌ను కోరారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు రితబ్రతకు మద్దతు ఇవ్వడంతో మమత నేతృత్వంలోని టీఎంసీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...