వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన టీఎంసీకి చెందిన 58 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. పార్టీ నుంచి సస్పెండైన రితబ్రతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ వారంతా స్పీకర్ రతీంద్ర బోస్కు లేఖ సమర్పించారు.
మరోవైపు శోభన్దేవ్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అభిషేక్ బెనర్జీ స్పీకర్ను కోరారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు రితబ్రతకు మద్దతు ఇవ్వడంతో మమత నేతృత్వంలోని టీఎంసీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

