వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రతిష్టాత్మక ‘మత్స్య 6000’ జలాంతర్గామిని ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు మధ్య సముద్రంలోకి పంపనున్నట్లు ఎన్ఐవోటీ డైరెక్టరు బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. తొలి విడతగా మనుషులతో కూడిన ఈ నౌక 500 మీటర్ల లోతుకు వెళ్లి కీలక పరిశోధనలు చేయనుంది.
ఈ ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది ఏకంగా 6 వేల మీటర్ల లోతుకు వెళ్లేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగం సముద్ర ఖనిజ వనరుల అంచనాకు, సాగర గర్భ పర్యాటక సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఎంతగానో దోహదపడనుంది.
Comments
Loading comments...

