వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్లైన్లో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించేందుకు ముగ్గురు ప్రతినిధులను నియమించింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ పార్టీ, ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధమైంది.
వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపిన వివరాల ప్రకారం.. సౌరవ్ దాస్ ముఖ్య ప్రతినిధిగా, విజేత దహియా, అశుతోష్ రాంకా ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వీరు న్యాయ, సామాజిక, పర్యావరణ, విద్యా రంగాలకు సంబంధించిన సమస్యలపై ప్రజల తరపున గళం విప్పనున్నారు.
Comments
Loading comments...

