Back to feed
సిద్దిపేట జిల్లాలో కారు ఢీకొని ముగ్గురు మృతి!
Pavan Jun 14, 2026 5:04 AM సిద్దిపేట 16 views1 day ago

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో రాధవ్వ(60), లచ్చవ్వ(65) అక్కడికక్కడే మరణించగా.. 12 ఏళ్ల బాలిక సహస్ర ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.
అనంతరం కారు స్తంభాన్ని ఢీకొట్టడంతో అందులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Comments
Loading comments...



