Back to feed
సింగపూర్ భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
Rohit Jun 15, 2026 4:20 AM అమరావతి 8 viewsabout 6 hours ago

సింగపూర్లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పెట్టుబడులు, సాంకేతికత, రోబోటిక్స్, విద్యా రంగాల్లో సింగపూర్తో రాష్ట్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు.
ఏపీలో ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఎగుమతులు, ఏవియేషన్ MRO, నౌకా నిర్మాణ రంగాల్లో ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ఈ భేటీ ద్వారా ఏపీ పారిశ్రామిక వృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...



