Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాలు మావే : చంద్రబాబు

Rohit Jun 14, 2026 7:54 AM అమరావతి 25 views1 day ago
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాలను తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా కింద రూ.65 వేల కోట్ల పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. తల్లికి వందనం, స్త్రీశక్తి ద్వారా 71 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు, దీపం-2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు మత్స్యకార, ఆటో డ్రైవర్ల సేవ, నేతన్నలకు ఉచిత విద్యుత్‌ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...