Back to feed
టీడీపీ సీనియర్ నేత గోవిందు శెట్టి మృతి
Vikram Chandra Jun 11, 2026 9:27 AM కర్నూలు 6 views4 days ago

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొట్టు గోవిందు శెట్టి (72) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ఆదోని టీడీపీ ఇన్చార్జి మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పార్టీ కార్యాలయంలో రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. గోవిందు శెట్టి పార్టీ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన మరణం తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

