Back to feed
ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’: స్ట్రీమింగ్ వివరాలు
Harika Jun 12, 2026 5:44 AM అల్ ఇండియా 7 views3 days ago

సూర్య, త్రిష జంటగా నటించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ఓటీటీలోకి వచ్చేసింది. మే 15న థియేటర్లలో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ యాక్షన్ డ్రామా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.
న్యాయవ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించే ఒక పవర్ఫుల్ లాయర్ కథగా సాగే ఈ చిత్రం, మోడ్రన్ మైథలాజికల్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్టులో సూర్య నటన, సాయి అభ్యంకర్ సంగీతం హైలైట్గా నిలిచాయి.
Comments
Loading comments...



