వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఈ నియామకాలతో సర్వోన్నత న్యాయస్థానంలో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరనుంది.
జస్టిస్ శీల్నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్పళ్లి, సీనియర్ న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహనలను కొలీజియం మే 27న సిఫార్సు చేసింది. మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Comments
Loading comments...

