Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Follow Udayam on Google
Ravi Shukla Jun 03, 2026 2:33 PM జాతీయంGeneral
ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - Udayam
నైపుణ్యంతో కూడిన ఆటలైనా, డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తే దానికి రాజ్యాంగ రక్షణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని తేల్చిచెప్పింది. బెట్టింగ్ అనేది ఎవరికీ ‘మౌలిక హక్కు’ కాదని జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు తెచ్చిన నిషేధ చట్టాలు పూర్తిగా చెల్లుతాయని కోర్టు పేర్కొంది. ఆన్‌లైన్ వ్యసనాలతో యువత అప్పులపాలవుతున్న సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, సమాజ హితం కోసమే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...