Back to feed
సోషల్ మీడియా పవర్: ఆ ఒక్క పోస్ట్తో అధికారులు ఏం చేశారంటే?
Mahesh Jun 14, 2026 3:57 AM ప్రకాశం 15 views1 day ago
వేములకోట గ్రామంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభంపై సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుకు అధికారులు వెంటనే స్పందించారు. లైన్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీ సహాయంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.
కూలిపోయే స్థితిలో ఉన్న స్తంభాన్ని నిలబెట్టి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ సంఘటనతో సోషల్ మీడియా వేదికగా అధికారులు చూపిన వేగవంతమైన స్పందనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

