Back to feed
సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్లోకి సింధు
Rohit Singh May 28, 2026 10:31 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లోకి భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ప్రవేశించింది. రౌండ్ ఆఫ్ 16లో జపాన్ క్రీడాకారిణి రికో గుంజిని 21-9, 21-12 తేడాతో చిత్తు చేసి తదుపరి రౌండ్కు చేరుకుంది. తదుపరి మ్యాచ్లో కొరియాకు చెందిన అన్ సే యంగ్తో సింధు తలపడనుంది.
లక్ష్య సేన్, సాత్విక్-చిరాగ్ జోడీ కూడా క్వార్టర్స్కు చేరుకున్నారు. థాయిలాండ్ ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలగడంతో లక్ష్య సేన్కు విజయం వరించింది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్-తనిషా జోడీ కూడా క్వార్టర్స్లోకి ప్రవేశించి భారత్కు గొప్ప రోజును అందించారు.
Comments
Loading comments...



