Back to feed
శుభ్మన్, ఇషాన్ సెంచరీల వెనుక అసలు కథ?
Sonal Sinha Jun 18, 2026 5:12 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

అఫ్గానిస్థాన్తో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 170 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) మెరుపు శతకాలతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 402 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం 403 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ను భారత బౌలర్లు అర్ష్దీప్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో కుప్పకూల్చారు. దీంతో అఫ్గాన్ జట్టు 232 పరుగులకే ఆలౌట్ అయి సిరీస్ను భారత్కు సమర్పించుకుంది.
Comments
Loading comments...



