వార్తలకు తిరిగి వెళ్లండి

కథానాయకుడు శర్వానంద్ వచ్చే సంక్రాంతి రేసులో నిలిచేందుకు సిద్ధమయ్యారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న తన సరికొత్త చిత్రాన్ని 2027 ముగ్గుల పండగ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. శ్రీను వైట్ల మార్క్ ఆద్యంతం వినోదాత్మక శైలిలో ఈ చిత్రం సాగనుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

