వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నెండేళ్లుగా మూతపడిన రాందాస్తండా పాఠశాలను గ్రామస్థులు, యువకులు ఏకమై తిరిగి ప్రారంభించారు. లక్ష రూపాయల సొంత ఖర్చుతో భవనానికి మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దారు.
ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి, ఉచితంగా పుస్తకాలు అందించారు. అధికారులు ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

