Back to feed
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు
Ravi Singh Jun 03, 2026 1:09 PM అల్ ఇండియా 8 viewsabout 11 hours ago

ఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ (పర్పుల్, సెలెక్ట్ బ్లాక్) వినియోగదారులకు ఎస్బీఐ కార్డ్ షాక్ ఇచ్చింది. జూలై 1, 2026 నుంచి ఇన్సూరెన్స్, యూటిలిటీ బిల్లులు, విద్యా రుసుములు, జ్యువెలరీ, టోల్ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
పర్పుల్ కార్డ్ హోల్డర్లకు ఫోన్పే, ఆన్లైన్ ఖర్చులపై నెలకు ఉన్న 1,000 రివార్డ్ పాయింట్ల పరిమితి మారనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఇన్సూరెన్స్ సంబంధిత చెల్లింపులపై నెలకు గరిష్టంగా 250 రివార్డ్ పాయింట్లు మాత్రమే లభిస్తాయి.
Comments
Loading comments...



