Back to feed
తెన్నేరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా
Ritika Sharma Jun 08, 2026 12:08 PM కృష్ణా జిల్లా 1 viewsabout 1 hour ago

Photo Gallery
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు సమీపంలో ఓ ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణంలో ఒక్కసారిగా స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురికి గాయాలు కాగా, తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...




