Back to feed
రైల్వే టికెట్ బుకింగ్లో సరికొత్త విప్లవం
Anita Joshi Jun 08, 2026 9:39 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago

రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 1986 నాటి పాత సాంకేతికత స్థానంలో, ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్’ను రైల్వే శాఖ అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త అప్గ్రేడ్ వల్ల ఎలాంటి సర్వర్ సమస్యలు లేకుండా నిమిషాల వ్యవధిలోనే లక్షలాది ఆన్లైన్ టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.
దీంతోపాటు వెయింటింగ్ లిస్ట్ కన్ఫర్మేషన్ను అంచనా వేసే ఏఐ టూల్ కచ్చితత్వాన్ని 94 శాతానికి పెంచారు. దాదాపు 88 శాతం బుకింగ్స్ డిజిటల్ రూపంలోనే జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...



