Back to feed
భారత్-నేపాల్ సరిహద్దులో టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ అరెస్ట్
Raghav Bahl Jun 08, 2026 10:22 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అరెస్ట్ చేసింది. ఎన్నికల అనంతరం ఆయనపై ఐదు కేసులు నమోదు కాగా, కలకత్తా హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఈ చర్య తీసుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో ‘పుష్ప’ డైలాగులతో సవాల్ విసిరిన ఈయన, ఫలితాల తర్వాత అండర్గ్రౌండ్లోకి వెళ్లారు. బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే ఈ సంచలన అరెస్ట్ నమోదైంది.
Comments
Loading comments...


