వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది ట్రోఫీని కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ (75 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించడంతో బెంగళూరు నగరంలో అభిమానులు అర్ధరాత్రి బాణసంచా కాలుస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
గతేడాది తొక్కిసలాట ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, పలు ప్రాంతాల్లో అభిమానులు శ్రుతిమించి ప్రవర్తించారు. రోడ్లపై చొక్కాలు విప్పి వీరంగం సృష్టించడంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
Comments
Loading comments...

