Back to feed
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Sagarika Ghose May 13, 2026 8:32 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే భారత్లో ఇంధన ధరల పెంపు తప్పకపోవచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. చమురు సరఫరాకు ఆటంకం కలిగితే ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
ఇంధన వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రజలకు సూచించారు. మరోవైపు బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం పెంచడంతో ధరలు భారీగా పెరిగాయి.
Comments
Loading comments...



