Back to feed
వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం: నేటి నుంచే ‘ఎంపీసీ’ మీటింగ్
Rajdeep Sardesai Jun 03, 2026 8:52 AM అల్ ఇండియా 10 viewsabout 15 hours ago

ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడు రోజుల సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. శుక్రవారం పాలసీ నిర్ణయాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి రెపో రేటును 5.25 శాతం వద్దే యథాతథంగా కొనసాగించవచ్చని మెజారిటీ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఇంధన ధరల పెరుగుదల వల్ల భవిష్యత్తులో వచ్చే రిస్క్లను అంచనా వేసేందుకు ఆర్బీఐ మరికొంత కాలం వేచిచూసే ధోరణి అవలంబించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో కఠిన నిర్ణయాలు ఉండవచ్చని భావిస్తున్నారు.
Comments
Loading comments...


