వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్లోని ఐదు ప్రముఖ దేవాలయాలతో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలను పేల్చేస్తామంటూ గురువారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. 'ఆపరేషన్ బ్లూ స్టార్' వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ ముప్పు రావడంతో పోలీసులు అప్రమత్తమై ఆలయాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ప్రాథమిక తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని, ఇవి నకిలీ బెదిరింపులుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా భద్రతను మరింత పటిష్టం చేశారు.
Comments
Loading comments...

