Back to feed
పంజాబ్లో ముందస్తు ఎన్నికల సంకేతాలు: కేజ్రీవాల్
Ravi Jun 13, 2026 12:01 PM అల్ ఇండియా 29 views2 days ago

పంజాబ్లో గడువు కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంకేతాలిచ్చారు. 2027 ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు 2026 నవంబర్లోనే ఉండవచ్చని పేర్కొంటూ, కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు. అలాగే, వచ్చే ఎన్నికల్లోనూ భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించిన కేజ్రీవాల్, ఆప్ ప్రభుత్వం నిజాయితీగా పాలన సాగిస్తుందని కొనియాడారు. గత ప్రభుత్వాల అవినీతిని ఎండగడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...



