Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ: బీజేపీ నేత పర్మీందర్

Follow Udayam on Google
Vishal Jun 13, 2026 1:37 AM జాతీయంGeneral
పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ: బీజేపీ నేత పర్మీందర్ - Udayam
పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని బీజేపీ నేత పర్మీందర్ సింగ్ బ్రార్ స్పష్టం చేశారు. మొత్తం 117 స్థానాల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం భగవంత్ మాన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. పంజాబ్‌ను గాడిన పెట్టేందుకు మాన్‌కు 4 నెలల సమయం మాత్రమే ఉందని, ఆ తర్వాత బీజేపీకే ప్రజలు పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...