Back to feed
రూ.లక్ష కోట్ల భూముల రక్షణ: హైడ్రా కమిషనర్ రంగనాథ్
Priyanka Chaturvedi Jun 08, 2026 11:24 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago

గడిచిన రెండేళ్లలో అక్రమార్కుల చెర నుంచి రూ.లక్షా 10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువు భూములను రక్షించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాదికి ఈ సంరక్షణ విలువ రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని, భూమాఫియా అంతానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.
నగరంలో పర్యావరణ సమతుల్యత కాపాడటమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోందని ఆయన వివరించారు. ఇటీవల కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగి పరిసరాల్లో వేలాది కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుని, వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేసినట్లు రంగనాథ్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

