Back to feed
ఉత్తరప్రదేశ్లో ‘ప్రాజెక్ట్ గంగా’ ప్రారంభం: డిజిటల్ విప్లవానికి శ్రీకారం
Vikram Chandra Jun 10, 2026 6:53 AM అల్ ఇండియా 27 views5 days ago

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ గంగా’ను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కల్పించి, విద్య, టెలీమెడిసిన్, ఈ-గవర్నెన్స్ సేవలను విస్తరించడమే దీని లక్ష్యం. 20 లక్షల కుటుంబాలకు డిజిటల్ కనెక్టివిటీ అందించడం, లక్షకు పైగా ఉపాధి అవకాశాలు సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
మొదటి దశలో 21 జిల్లాల్లో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 8 వేల మంది డిజిటల్ వ్యవస్థాపకులను తయారు చేస్తారు. యువతకు వడ్డీ లేని రుణాలతో స్వయం ఉపాధి కల్పిస్తారు. ఇందులో 50 శాతం భాగస్వామ్యం మహిళలకే కల్పించడం విశేషం.
Comments
Loading comments...



