Back to feed
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రియాంక గాంధీ ఫోకస్
Vikram Jun 11, 2026 10:37 AM అల్ ఇండియా 5 views4 days ago

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే బాధ్యతలను ఆమె స్వీకరించారు.
ఈ ఐదు రాష్ట్రాల్లో స్థానిక సమస్యలపై అధికార పక్షాలను నిలదీసేలా వ్యూహాలు రచించడంతో పాటు, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.
Comments
Loading comments...



