వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా తడ వద్ద జాతీయ రహదారిపై శ్రీసిటీ కార్మికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించి కార్మికులు వెంటనే కిందకు దిగడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.
చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా, ప్రమాద కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...

