Back to feed
ముప్పాళ్ల మండలంలో రేపు విద్యుత్ నిలిపివేత
Vikranth Jun 12, 2026 10:07 AM పల్నాడు జిల్లా 10 views3 days ago

ముప్పాళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ అధికారులు తెలిపారు. సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లలో అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ షట్డౌన్ చేపడుతున్నారు.
అత్యవసర పనుల దృష్ట్యా వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరీష్ శ్రీనివాస ప్రసాద్ కోరారు. ఈ సమయంలో ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

