Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చిన్నారి జాను కోసం 4,800 ఫోన్ కాల్స్ విశ్లేషించిన పోలీసులు

Anita Jun 15, 2026 3:13 AM కాకినాడ 5 viewsabout 7 hours ago
చిన్నారి జాను కోసం 4,800 ఫోన్ కాల్స్ విశ్లేషించిన పోలీసులు - Udayam Digital
కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు తొమ్మిదో రోజుకు చేరుకుంది. 4,800 ఫోన్ కాల్స్ విశ్లేషించిన పోలీసులు, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. థర్మల్ డ్రోన్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో కొండ ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. చిన్నారి వెంట ఉన్న శునకం మృతిపై పోస్ట్‌మార్టం నిర్వహించి, రిపోర్టు కోసం విశాఖ ల్యాబ్‌కు పంపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...