వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం మాజీ సీఎం జగన్ చేసిందేమీ లేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ విమర్శించారు. జగన్ రాసిన లేఖలు స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేందుకేనని, వైసీపీ హయాంలో గనుల లీజుల పొడిగింపులో జాప్యం వల్ల ప్లాంట్ ఇబ్బందుల్లో పడిందని ఆరోపించారు.
ఎన్డీయే ప్రభుత్వం వచ్చాకే లీజులు పొడిగించారని తెలిపారు. గతంలో వాజపేయి ద్వారా చంద్రబాబు రూ.1350 కోట్లు, ఇటీవల మోదీతో మాట్లాడి రూ.12 వేల కోట్ల ప్యాకేజీ తెచ్చి ప్లాంట్ను కాపాడారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

