వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ పైప్లైన్ తొలగించేందుకు పది వేల రూపాయల లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి రాజాగౌడ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన సర్పంచ్ భర్తను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిద్దరిపై కేసు నమోదు చేసి హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

