వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనంలో ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) పద్ధతిపై వచ్చిన వివాదాల నేపథ్యంలో బోర్డు చీఫ్ రాహుల్ సింగ్కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. జవాబు పత్రాలు తారుమారయ్యాయంటూ విద్యార్థులు చేసిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ వివాదంలోని సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ లోపాలపై విచారించాలని 'సెర్ట్-ఇన్' (CERT-In) సంస్థను కమిటీ కోరింది. విద్యార్థుల సమస్యలు, అలాగే త్రిభాషా సూత్రం అమలుపై చర్చించేందుకు విద్యాశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది.
Comments
Loading comments...

