Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రాజౌరీలో 10వ రోజుకు చేరిన 'ఆపరేషన్ షేరువాలి'

Nisha Joshi Jun 02, 2026 7:21 AM అల్ ఇండియా 23 views1 day ago
రాజౌరీలో 10వ రోజుకు చేరిన 'ఆపరేషన్ షేరువాలి' - Udayam Digital
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ షేరువాలి' నిన్న 10వ రోజుకు చేరింది. సైన్యం ఇతర భద్రతా సంస్థలతో కలిసి ఉగ్రవాదుల స్థావరాలను తుడిచిపెట్టేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో వైట్ నైట్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పి.కె. మిశ్రా నియంత్రణ రేఖ (LoC) వెంట ఉన్న సైనిక స్థావరాలను సందర్శించి భద్రతా సన్నద్ధతను సమీక్షించారు. కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపుతున్న అంకితభావాన్ని, నిఘా వ్యవస్థల పనితీరును ఆయన కొనియాడారు.

Comments

G
Loading comments...