Back to feed
ఓపెన్డోర్ భారత్ కార్యకలాపాలు బంద్: 250 మంది ఉద్యోగుల తొలగింపు
Ravi Jun 11, 2026 12:19 PM అల్ ఇండియా 7 views4 days ago

అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ 'ఓపెన్డోర్' భారత్లో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ఈ నిర్ణయంతో బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లోని సుమారు 250 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. సంస్థ తన వ్యాపారాన్ని ఏఐ-ఆధారిత విధానంలో అమెరికాకే పరిమితం చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం, కార్యకలాపాలను అమెరికాకు తరలించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు పరిహారం, అవుట్ప్లేస్మెంట్ సేవలు అందించనున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...



