వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు దేశానికి ఒక మేల్కొలుపు అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. ఇంధన ఉత్పత్తిని పెంచామని, ప్రస్తుతం దేశంలో ముడిచమురు కొరత లేదని స్పష్టం చేశారు.
సుమారు 69 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అమెరికా-ఇరాన్ వివాద నేపథ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఇంధన సరఫరాలో ఆటంకాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.
Comments
Loading comments...

