వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన మహేశ్ (30) ఒక ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన బిచ్కుంద KGBVలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు.
మరోవైపు, డిచ్పల్లి హైవేపై జరిగిన ప్రమాదంలో జక్రాన్పల్లి మండలానికి చెందిన బలరాం (26), చిన్న నవీన్ (20) మృతి చెందారు. ఒకే రోజు చోటుచేసుకున్న ఈ వరుస ప్రమాదాలు స్థానికంగా విషాదం నింపాయి.
Comments
Loading comments...

