వార్తలకు తిరిగి వెళ్లండి

180 రోజుల లోపు వీసాతో భారత్కు వచ్చే విదేశీయులు ఇక్కడ అదనంగా ఉండాలనుకుంటే, వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో ఉన్న 14 రోజుల అదనపు గడువు సదుపాయాన్ని హోంశాఖ రద్దు చేసింది.
అలాగే, భారత్లో విదేశీయులకు పిల్లలు పుడితే 30 రోజుల్లోపు ఆన్లైన్లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది. అయితే, తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరులై ఉంటే మాత్రం ఈ జనన నమోదు నిబంధన నుండి మినహాయింపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...

