Back to feed
కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ
Ravi Shukla Jun 12, 2026 5:33 AM తిరుపతి 7 views3 days ago

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్, కోడలు రాధికతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న అంబానీ కుటుంబానికి తితిదే అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
వారు స్వామివారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అంబానీ కుటుంబానికి ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

