Back to feed
పరువు కోసం కన్నకూతురినే చంపిన తల్లి
Jayanth Jun 10, 2026 7:23 PM శ్రీకాకుళం 9 views5 days ago

శ్రీకాకుళం జిల్లాలో పరువు కోసం కన్నకూతురినే చంపిన దారుణ ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్న వివాహిత హరిణి మరో యువకుడితో రిలేషన్ లో ఉండటాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు.
విడాకులు ఇప్పిస్తామని నమ్మించి స్వగ్రామానికి రప్పించి.. తల్లి, తాత, భర్త కలిసి ఆమెను హతమార్చి గుండెపోటుగా నమ్మించి అంత్యక్రియలు చేశారు. అయితే చనిపోయే ముందు హరిణి తన ప్రియుడికి పంపిన సెల్ఫీ వీడియో ఆధారంగా ఈ హత్య కేసును పోలీసులు ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

