Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

జల వివాదాల పరిష్కారానికి మోదీ పిలుపు

Neha Sharma May 28, 2026 11:09 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
జల వివాదాల పరిష్కారానికి మోదీ పిలుపు - Udayam Digital
అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. కెన్-బెట్వా వంటి నదుల అనుసంధాన ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల అమలులో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా, ప్రజలకు సకాలంలో సౌకర్యాలు అందవని ఆయన హెచ్చరించారు. జల భద్రత కోసం నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలని మోదీ కోరారు. అలాగే స్వచ్ఛభారత్ మిషన్, నగరాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...