వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి ఎయిర్పోర్టులో 11 కేజీల గంజాయితో కేరళకు చెందిన మోడల్ హర్ష సన్నీని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఆమె వద్ద దాదాపు రూ.11.82 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. నిందితురాలు 2025 మిసెస్ కేరళ పోటీల్లో పాల్గొనడం గమనార్హం.
ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మోడల్ను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఈ మాదకద్రవ్యాలను ఎవరి కోసం, ఎక్కడికి తరలిస్తుందనే కోణంలో లోతైన విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...

