వార్తలకు తిరిగి వెళ్లండి

తునిలో ఏడు రోజులుగా నిఖార్సైన ఆనవాళ్లు లేక అదృశ్యమైన జ్ఞానేశ్వరి (2) ఆచూకీ కోసం అధికారులు జీపీఎస్ ట్రాకర్ కలిగిన స్నిఫర్ డాగ్తో గాలింపు చేపట్టారు. అయితే ఆ కుక్క సమీప తోటలు, ప్రధాన రహదారిపై కొంత దూరం పరుగెత్తి తిరిగి ఇంటికే చేరుకుంది.
చాలాసేపు ఇల్లే చుట్టేయడంతో అడవి వైపు వెళ్తుందనుకున్న అధికారులకు నిరాశే ఎదురైంది. జాగిలం ప్రవర్తన వింతగా ఉండటంతో అసలు ఏం నమ్మాలో తెలియక అటు పోలీసులు, ఇటు స్థానికులు తీవ్ర గందరగోళంలో పడ్డారు.
Comments
Loading comments...

