Back to feed
మంత్రి సవిత ప్రజా దర్బార్
Geeth Jun 13, 2026 10:52 AM పెనుకొండ 21 views2 days ago

పెనుకొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత శనివారం 'ప్రజా దర్బార్' నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలు, సందర్శకుల నుండి ఆమె స్వయంగా సమస్యలపై అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

