Back to feed
కుప్పంలో అర్ధరాత్రి గ్రానైట్ లారీ సీజ్
Arjun Jun 14, 2026 3:31 AM చిత్తూరు 13 views1 day ago

కుప్పం టమాటా మార్కెట్ సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో అక్రమంగా నిలిపిన గ్రానైట్ లారీని పోలీసులు శనివారం రాత్రి సీజ్ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఈ రవాణా సాగుతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు.
ఈ అక్రమ రవాణాపై మైనింగ్ అధికారులకు సమాచారం అందించామని కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

