Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గేతో ముగిసిన డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Follow Udayam on Google
Sonia Singh Jun 01, 2026 4:14 PM హైదరాబాద్General
ఖర్గేతో ముగిసిన డిప్యూటీ సీఎం భట్టి భేటీ - Udayam
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన ఆయన, అక్కడి కాంగ్రెస్ వ్యవహారాలు మరియు తాజా రాజకీయ పరిణామాలను ఖర్గేకు వివరించారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, స్థానిక నేతలతో జరిపిన చర్చల వివరాలను నివేదించారు. 'ఇండియా' కూటమి ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.

Comments

G
Loading comments...