వార్తలకు తిరిగి వెళ్లండి
రామ్ మందిర్ విరాళాల వివాదంపై మాయావతి సంచలన వ్యాఖ్యలు

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం స్పందించారు. ఈ నిధుల గోల్మాల్ వ్యవహారం అత్యంత తీవ్రమైనదని, తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆమె అభివర్ణించారు.
అయితే, ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని విపక్షాలకు ఆమె హితవు పలికారు. ఆలయ విరాళాల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి రావాలని, కానీ దీనిపై రాజకీయం చేయడం సరికాదని మాయావతి హెచ్చరించారు.
Comments
Loading comments...