వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగాల్లో భారీ అగ్నిప్రమాదం: 20 మందికి గాయాలు

పశ్చిమ బెంగాల్లోని హల్దియా పెట్రోకెమికల్స్ నాఫ్తా పైప్లైన్లో జరిగిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు గాయపడ్డారు. సమీపంలోని ఇళ్లు ధ్వంసమవ్వగా, రైల్వే సేవలు నిలిచిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
పైప్లైన్ నుంచి నాఫ్తాను అక్రమంగా చోరీ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...