Back to feed
తాళం వేసి ఊరెళ్లారు.. గంటల్లోనే కోలుకోలేని షాక్ ఇచ్చారు
Ravi Jun 15, 2026 5:26 AM చిత్తూరు 3 viewsabout 4 hours ago
తిరుచానూరు వర్ష విశ్వనాథ్ నగర్లో ఆదివారం మధ్యాహ్నం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. బాధితుడు రంజిత్ కుమార్ కుటుంబం ఇళ్లకు తాళం వేసి ఊరికి వెళ్లిన కాసేపటికే దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
బీరువాలో దాచిన సుమారు 8 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 50 వేల నగదును దొంగిలించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

